byసూర్య | Tue, Sep 24, 2024, 10:26 PM
మహబూబాబాద్ జిల్లా, జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల గూడూరు 2007-2008 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు సుదీర్ఘ కాలం 16 సంవత్సరాల తరువాత, సెప్టెంబర్ 22, 2024 నాడు గూడూరు సమీపంలోని శ్రీ శ్రీ శ్రీ వట్టివాగు సమ్మక్క సారలమ్మ జాతర వద్ద పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో వారి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోని, ఇన్ని సంవత్సరాల తరువాత ఒకరిని ఒకరు పూర్వ విద్యార్థులు పలకరించుకుని, చాలా సంతోషంలో మునిగి తేలారు.
ఈ క్రమంలో మాట్లాడుతూ.. తాము బౌతికంగా ఒకరికొకరు దూరంగా ఉన్న, తమతో ఒకరికొకరికి గల అనుబంధం, ప్రేమ ఆప్యాయతలు, జ్ఞాపకాలు శాశ్వతంగా తమలోని ఉంటాయని తెలియజేశారు. ఇలాంటి సమ్మేళనాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ, ఆట పాటలతో పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతంగా పూర్తి ముగించుకున్నారు.