పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

byసూర్య | Tue, Sep 24, 2024, 10:26 PM

మహబూబాబాద్ జిల్లా, జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల  గూడూరు 2007-2008 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు సుదీర్ఘ కాలం 16 సంవత్సరాల తరువాత, సెప్టెంబర్ 22, 2024 నాడు గూడూరు సమీపంలోని శ్రీ శ్రీ శ్రీ వట్టివాగు సమ్మక్క సారలమ్మ జాతర వద్ద పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో వారి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోని, ఇన్ని సంవత్సరాల తరువాత ఒకరిని ఒకరు పూర్వ విద్యార్థులు పలకరించుకుని,  చాలా సంతోషంలో  మునిగి తేలారు.
ఈ క్రమంలో మాట్లాడుతూ.. తాము బౌతికంగా ఒకరికొకరు దూరంగా ఉన్న, తమతో ఒకరికొకరికి గల అనుబంధం, ప్రేమ ఆప్యాయతలు, జ్ఞాపకాలు శాశ్వతంగా తమలోని ఉంటాయని తెలియజేశారు.  ఇలాంటి సమ్మేళనాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని  ఆశిస్తూ, ఆట పాటలతో  పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతంగా పూర్తి ముగించుకున్నారు.


Latest News
 

ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM