పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన

byసూర్య | Tue, Sep 24, 2024, 10:32 PM

పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను నిరంతరాయంగా, యుద్ధ ప్రాతిపదికన చేసి పూర్తి చేయాలనీ రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం రాత్రి మంత్రి పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు చేసే ప్రాంతంలో లైటింగ్ సరిపడేంత లేకపోవడం గమనించిన మంత్రి లైట్లు ఏర్పాటు చేసి పనులు నిరంతరాయంగా చేసి పూర్తి చేయాలనీ ఆదేశించారు. పనులు ఆశించిన మేరకు పురోగతిలో లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సామర్థ్యం మేరకు పనులు నిర్వహించి కాల్వ పునరుద్ధరణ చేసి రైతులకు సాగునీరు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


Latest News
 

ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM