byసూర్య | Tue, Sep 24, 2024, 10:29 PM
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ .రాష్ట్రంలో మినీ అంగన్వాడీలకు పెండింగ్ నాలుగు నెలల జీతాలు ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా.ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య పాల్గొని మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న మినీ అంగన్వాడీలకు నాలుగు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని వాళ్ళందర్నీ ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని రెగ్యులర్ వేతనాలు.
ఇవ్వాలని పెరుగుతున్నదారులకు అనుగుణాలు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని, ప్రమాద బీమా 10 లక్షల సౌకర్యాలు కల్పించాలని, అంగన్వాడి సెంటర్లలో కనీస వసతులు కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ బడ్జెట్ పెట్టి అంగన్వాడి కేంద్రాలను అభివృద్ధి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మినీ అంగన్వాడీలు నాయకులు అంగన్వాడి జిల్లా యూనియన్ జిల్లా కార్యదర్శి భారతి తదితరులు పాల్గొన్నారు.