చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు.. ఏపీ సీఎంపై కేటీఆర్ ప్రశంసలు

byసూర్య | Tue, Sep 24, 2024, 09:28 PM

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఎన్నికల సమయంలోనే పెన్షన్ పెంచుతామని చంద్రబాబు మాట ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఆ మాటను నిలబెట్టుకున్నారని కేటీఆర్ వివరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వారంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని వృద్దులకు చంద్రబాబు ఫించన్ పైసలు పెంచారని చెప్పుకొచ్చారు.


అయితే.. అదే మాటను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు.. దాని ఊసే ఎత్తటం లేదంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి తప్పారంటూ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం చిట్టినాయుడు సోదరుల కంపెనీ నడుస్తుందంటూ సెటైర్లు వేశారు. మరోవైపు.. రైతు భరోసా పథకం అమలుపై కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు, భరోసా కాదు.. అసలు సీఎం కుర్చీకే భరోసా లేదంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ అన్ని సీట్లు గెలిచి.. క్లీన్ స్వీప్ చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ నగర ప్రజలపై కక్ష కట్టారని ఆరోపించారు. ఈ క్రమంలోనే.. కష్టపడి కట్టుకున్న పేదల ఇండ్లను నిర్ధాక్షిణ్యంగా కూలగొడుతున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కానీ.. మాదాపూర్‌లోని తన సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని మాత్రం కూల్చట్లేదని ఆరోపించారు. తిరుపతి రెడ్డికి ఒక న్యాయం.. పెదవాళ్లకు మరో న్యాయమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కోర్టులు పనిచేయని.. శనివారం, ఆదివారం వచ్చి కూల్చివేతలు చేపడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ క్రమంలోనే.. హీరో నాగార్జున కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసిందని గుర్తు చేసిన కేటీఆర్.. దానికి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్న విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. అనుమతులు ఇచ్చిన అధికారులను ఎందుకు శిక్షించట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు.. పట్నం మహేందర్ రెడ్డి ఫాంహౌస్‌ను ఎందుకు కూల్చట్లేదని ప్రశ్నించారు. మంత్రుల ఫాంహౌసులు ఎందుకు ముట్టుకోవట్లేదని నిలదీశారు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఇండ్లు కట్టామని స్పష్టం చేసిన కేటీఆర్.. హైడ్రా కూల్చిన పేదలకు ఆ డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


Latest News
 

ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM