సీఎం రేవంత్ సోదరుడికి భారీ ఊరట.. దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే

byసూర్య | Mon, Sep 23, 2024, 07:48 PM

హైదరాబాద్‌ నగరంలో ఆక్రమణలపైకి దూసుకెళ్తున్న బుల్డోజర్లు.. హడలెత్తిస్తున్నాయి. అక్రమార్కులు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు సామాన్యులైనా.. సెలెబ్రిటీలైనా.. రాజకీయ నాయకులైన.. బడాబాబులైనా.. ఎవ్వరైనా సరే.. నిర్దాక్షిణ్యంగా కట్టడాలను నేలమట్టం చేస్తూ ముందుకెళ్తోంది హైడ్రా. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ నలువైపులా హైడ్రా బుల్డోజర్లు వాటి పని అవి చేసుకుంటున్నాయి.


ఈ క్రమంలోనే.. హైడ్రా కూల్చివేతలను ఆపేయాలంటూ కొందరు.. తమ నిర్మాణాలు కూల్చకుండా స్టే విధించాలంటూ మరికొందరు హైకోర్టును ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే.. దుర్గం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మించిన పలు కట్టడాలకు హైడ్రా నోటీసులు జారీ చేయగా.. అక్కడి నివాసిసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.


ఈ క్రమంలోనే.. దుర్గం చెరువు పరిసర నివాసితులకు భారీ ఊరట లభించింది. దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. దీంతో.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా ఊరట లభించినట్టయింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు నిర్వాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో.. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి ఆరు వారాలలోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


అయితే.. మాదాపూర్‌ అమర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలో సీఎం రేవంత్ రెడడి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. తిరుపతి రెడ్డు ఇల్లుతో పాటు కార్యాలయం కూడా దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు.. 30 రోజుల గడువు కూడా ఇవ్వటం గమనార్హం. ఈ నోటీసులపై స్పందించిన తిరుపతి రెడ్డి.. తాను ఉంటున్న ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్న తనకు అభ్యంతరం లేదని తెలిపారు. కాగా.. ఇప్పుడు హైకోర్టు స్టే విధించటంతో.. తిరుపతి రెడ్డికి భారీ ఊరట లభించినట్టయింది.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM