ప్రసాదంలో కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
byసూర్య |
Mon, Sep 23, 2024, 07:31 PM
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణం హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ సోమవారం చేపట్టారు. తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణంలో పాత బస్టాండ్ నుండి చౌరస్తా వరుకు రాజకీయ పార్టీలకు అతీతంగా నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హిందూ మత పెద్దలు, రాజకీయ నాయకులు, వివిధ వర్గాల నాయకులు పాల్గొనడం జరిగింది.
Latest News