భార్యాభర్తల గొడవ ఆవేశంలో భార్య మృతి

byసూర్య | Mon, Sep 23, 2024, 05:18 PM

తరచూ భార్యాభర్తల గొడవలతో విసిగి చెందిన వంగ సుమలత 32 అనే మహిళ ఉరి వేసుకుని చనిపోయిన ఘటన సముద్రాల గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి అన్న  తెలిపిన వివరాల ప్రకారం  కోహెడ మండలం సముద్రాల గ్రామంలో వంగ బాలరాజు తో 2009లో వివాహం జరిగింది. గత ఐదు, ఆరు సంవత్సరాలుగా తాగినప్పుడు గొడవ పడే వారు నిన్న సాయంత్రం కూడా గొడవ జరగడంతో మనస్థాపం చెంది ఇంట్లోనే ఉరి వేసుకోవడం జరిగింది. భర్త చుట్టుపక్కల వాళ్ళు చూసి హుటాహుటిన సిద్దిపేట సివిల్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు చనిపోవడం జరిగింది.
మృతురాలికి కొడుకు అక్షయ 12  కూతురు తేజస్విని10 కలరు. మృతురాలి ఆడపడుచులు భర్త వేధించడంతో మనస్థాపం చెంది ఉరి వేసుకుని చనిపోయిందని మా చెల్లి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయాగలరని మృతురాలి అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని ఎస్సై అభిలాష్ తెలిపారు.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM