వరద బాధితులకు సహాయం అందించడం అభినందనీయం

byసూర్య | Sat, Sep 21, 2024, 03:24 PM

వరదతబాధితులకు సహాయం అందించడం అభినందనీయమని రూరల్ ఎస్.హెచ్.ఎం ఎం.రాజు అన్నారు. కల్లూరు పట్టణానికి చెందిన లంకా అప్పల నాయుడు సత్యావతి దంపతులు తమ కుమారుడు అన్వేష్ పుట్టిన రోజు సందర్భంగా.. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్లో వరదబాధితులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై బాధితులకు అందజేసి  రాజు మాట్లాడారు.. ప్రకృతి విలయం సృష్టించడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారని సర్వం కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనవతా దృక్పదంతో అప్పల నాయుడి కుటుంబం ఆదుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమని, భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని రాజు కోరారు.
నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన అప్పల నాయుడు మాట్లాడుతూ... ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనవంతు కర్తవ్యంగా సహాయం చేయాలని నిత్యావసర వస్తువులను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు పరిశ పుల్లయ్య, సముద్రాల పుల్లారావు, మిట్టకోలు లక్ష్మినారాయణ, జర్నలిస్టులు ఏనుగు వెంకటేశ్వరరావు, అశోక్, గంటల ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదన్న ఆర్యవైశ్య మహాసభ Sat, Sep 21, 2024, 05:28 PM
గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM