తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదన్న ఆర్యవైశ్య మహాసభ

byసూర్య | Sat, Sep 21, 2024, 05:28 PM

హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చడంపై తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మారుస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పొట్టి శ్రీరాములు పేరును మార్చడం సరైన నిర్ణయం కాదని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు.పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో... రాష్ట్రానికో చెందినవారు కాదని గుర్తించాలన్నారు. ఆయన దేశం గర్వించదగ్గ నాయకుడు అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని గాంధీజీ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. అలాంటి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం తెలుగు విశ్వవిద్యాలయానికి ఆ పేరు పెట్టారని, కానీ ఇప్పుడు మార్చడం సరికాదన్నారు.తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టి గౌరవించుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఆయనను గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం సరికాదన్నారు. ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టాలని విజ్ఞప్తి చేశారు.


Latest News
 

స్వరాష్ట్రం కోసం పరితపించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ : నీలం మధు ముదిరాజ్.. Sat, Sep 21, 2024, 07:49 PM
హిందీ దివస్ వారోత్సవాలు.. బహుమతులు ప్రధానం Sat, Sep 21, 2024, 07:48 PM
డ్రైవర్‌కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుంది : ఎండీ వీసీ సజ్జనార్ Sat, Sep 21, 2024, 07:46 PM
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి Sat, Sep 21, 2024, 07:42 PM
సర్వే శాఖ పనితీరును మెరుగు పరుచుకోవాలి Sat, Sep 21, 2024, 07:41 PM