byసూర్య | Sat, Sep 21, 2024, 03:42 PM
ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాలకు గురైన నీరుపేదలకు సీఎం సహాయ నిధి ఆసరాగా నిలుస్తున్నదని డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.కంగ్టి మండల పరిధిలోని చౌకన్ పల్లి గ్రామనికి చెందిన నిర్మల బాయికి సీఎం సహాయనిధి నుండి మంజూరైన చెక్కును డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఎమ్మెల్యే స్వగృహంలో లబ్ధిదారుకు అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... పేద ప్రజల వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు పెంచిందని అన్నారు.