byసూర్య | Sat, Sep 21, 2024, 03:17 PM
వికారాబాద్ జిల్లాలో తాజా రాజకీయాలపై సుధీర్ఘ మంతనాలు. రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ ఇవాళ హైదరాబాద్ లో కేటీఆర్ ను వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. బీసీ కమిషన్ సభ్యుడిగా మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేయడంతో కేటీఆర్ వారిని శాలువాతో సన్మానించి అభినందించారు.
బీఆర్ఎస్ పార్టీలో శుభప్రద్ పటేల్ కు కీలక స్థానం ఉంటుందని భరోసా కల్పించారు. బీఆర్ఎస్తోనే యువతకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో గతం కన్న రెట్టింపు ఉత్సహం తో పని చేయాలని సూచించారు. తెలంగాణ లో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.