హైదరాబాద్‌లో మరోసారి గంజాయి చాక్లెట్ల కలకలం

byసూర్య | Sat, Sep 21, 2024, 03:13 PM

హైదరాబాద్‌లో మరోసారి గంజాయి చాక్లెట్ల కలకలం రేగింది. రాచకొండ పరిథిలో భారీగా హాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్లను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఆదిభట్ల ప్రాంతంలో హాష్ ఆయిల్‌ తరలిస్తున్న నలుగురు ముఠాను పట్టుకున్నామని, వారి నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే మరోచోట 3.8 కిలోల గంజాయి చాక్లెట్లను సీజ్ చేసి, వాటిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ మధ్య నగరంలో మత్తుపదార్థాల కేసులు పెరుగుతున్నాయి. ఏకంగా విద్యార్థులు సైతం మత్తుపదార్థాలను విక్రయిస్తూ పోలీసుల చేతికి చిక్కుతుండడం ప్రస్తుతం కలవరపెడుతున్న అంశంగా మారింది.


 


 


Latest News
 

గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM
దామ్రాజపల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన Sat, Sep 21, 2024, 03:34 PM