సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

byసూర్య | Sat, Sep 21, 2024, 01:57 PM

జమిలి ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జమిలి ఎన్నికల ముసుగులో బీజేపీ  కుట్ర చేస్తోందని, దేశాన్ని కబళించాలని చూస్తోందని నిప్పులు చెరిగారు.సీపీఎం దివంగత నేత సీతారాం ఏచూరి సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన.. జమిలి ఎన్నికలనుద్దేశించి మాట్లాడారు. దేశంలో జమిలి ఎన్నికల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని, ఇలాంటి సమయంలో ఏచూరి లేకపోవడంతో దేశానికి నష్టం కలుగుతోందన్నారు. అయినా వెనకడుగు వేయకుండా అందరం కలిసి సీతారాం ఏచూరి స్ఫూర్తితో బీజేపీ కుట్రకు వ్యతిరేకంగా పోరాడాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.


ఇదిలా ఉంటే ఇటీవలే కేంద్ర క్యాబినెట్ (Central Cabinet) జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కొన్నేళ్ల నుంచి కేంద్రంలోని బీజేపీ కసరత్తు చేస్తోంది. దీనిపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  అధ్యక్షతన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇక ఇటీవలే రామ్‌నాథ్ కోవింద్ కమిటీ తయారుచేసిన రిపోర్ట్‌పై కేంద్ర కేబినెట్ సమావేశమైన ఆమెద ముద్ర వేసింది. అలాగే రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్‌ లో ప్రవేశపెడతామని తెలిపింది.


Latest News
 

గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM
దామ్రాజపల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన Sat, Sep 21, 2024, 03:34 PM