byసూర్య | Tue, Jul 09, 2024, 03:00 PM
నల్గొండ జిల్లా డిండిలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ గురుకులాన్ని సోమవారం ఆర్డిఓ శ్రీరాములు సందర్శించారు. హాస్టల్ గదులు, టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ వంటగది పరిశీలించి పరిసరాల పరిశుభ్రత సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలుకలు కరిచి అస్వస్థకు గురైన విద్యార్థినిలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్ ను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రిన్సిపాల్ కు సూచించారు.