byసూర్య | Tue, Jul 09, 2024, 02:58 PM
పెద్దపల్లి మండలం సబ్బితం గట్టు సింగారం గౌరీ గుండాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. మంగళవారం పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్ తో కలిసి సందర్శించారు. జలపాతాన్ని సందర్శించేందుకు రోడ్డు సదుపాయం, వాటర్ ఫాల్స్ వద్ద ఇతర సదుపాయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్థానని హామీ ఇచ్చారు.