byసూర్య | Tue, Jul 09, 2024, 02:57 PM
నారాయణపేట మండలం కొల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలో టీచ్ ఫర్ చెంజ్, వేణి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను మంగళవారం సినీ నటీ మంచు లక్ష్మి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎలాంటి విద్యను అందిస్తారు, ఎలా బోధిస్తారు అనే విషయాలను ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ క్లాసుల ద్వారా విద్యను అందించడం ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు.