byసూర్య | Tue, Jul 09, 2024, 11:43 AM
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం వనపర్తి జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల 8, 9 తరగతుల విద్యార్థులకు కవిత్వం, పోస్టర్ తయారీ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ గోవిందరాజులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలభవన్ లో భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరవు తట్టుకునే అంశాలపై కవిత్వం పోటీలు ఉంటాయన్నారు. తెలుగు, ఇంగ్లిష్ భాషలలో పోటీలు నిర్వహిస్తామన్నారు. పాల్గొన్న విద్యార్థులకు ధ్రువీకరణ పత్రం అందిస్తామన్నారు.