byసూర్య | Tue, Jul 09, 2024, 11:42 AM
భద్రాచలంలోని సాయిబాబా గుడి నుంచి తాతగుడి సెంటర్ వరకు వెళ్లే రోడ్డుపై నిత్యం వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. మంగళవారం రోడ్డుకు రెండు వైపులా కారులు నిలిపి ఉంచి, మరోవైపు పక్కనే ఉన్న పాత ఇనుప సామాన్ల వ్యాపారులు ప్రతిరోజు లారీ నిలిపి ఉంచి లోడింగ్ అన్ లోడింగ్ చేస్తున్నారు. రోడ్డుపైనే వెల్డింగ్ మిషన్ పెట్టి వెల్డింగులు చేస్తున్నారు. మరోవైపు పక్కనే ఉన్న వాటర్ ప్లాంట్ ఫుట్ పాత్ ను పూర్తిగా ఆక్రమించారు.