దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు

byసూర్య | Sun, Oct 27, 2024, 08:59 PM

దోపిడీ దొంగను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మైబిల్లి తెలిపిన వివరాల ప్రకారం నాచారం ఐడీఏలోని రోడ్డు నెంబర్ 15లో డ్యూయల్ టెక్నాలజీస్ ఎదురుగా కడ్తాల కనుకవ్వ టీ షాప్ నడుపుతుంది.ఆమె మెడలో 30 గ్రాముల బంగారం ఉండడం చూసిన బెంగాల్ రాష్ట్రానికి చెందిన సాగర్ పండిట్(21) ఈ నెల 6వ తేదీన రాత్రి సమయంలో ఆమెను బెదిరించి మెడ నుంచి బంగారం దోచుకెళ్లారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు క్రైమ్ డీఐ శ్రీశైలం, డీఎస్ఐ అలీ చొరవ తీసుకొని నిందితుడిని వెస్ట్ బెంగాల్లో పట్టుకొని 13 గ్రాముల గోల్డ్ బిస్కెట్స్ ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి నాచారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం రిమాండ్ కు పంపారు.


 


 


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM