byసూర్య | Sun, Oct 27, 2024, 08:45 PM
నాగర్ కర్నూల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత మర్రి జనార్దన్ రెడ్డి జమున దంపతులు ఆదివారం తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శోభ దంపతులను కలిశారు. నవంబర్ 17న జరగబోయే తమ కుమారుడి వివాహానికి రావాలని కెసిఆర్ దంపతులను ఆహ్వానించారు. వివాహానికి హాజరవుతానని కేసీఆర్ తెలిపారని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.