byసూర్య | Tue, Jul 09, 2024, 11:47 AM
చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో కౌన్సిలర్ సయ్యద్ నసీమ బేగం ఆధ్వర్యంలో సోమవారం సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి తొట్టెలను ఎప్పటికప్పుడుశుభ్రం చేసుకోవాలని, వేసవికాలంలో వాడిన కూలర్లలో నీరు తొలగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారి, వైద్యశాఖ, మెప్మా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.