byసూర్య | Tue, Jul 09, 2024, 11:48 AM
కోటపల్లి మండలంలో పోడు రైతులపై ఆటవీ శాఖ అధికారుల వేధింపులను వెంటనే నిలిపివేయాలని సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో చెన్నూర్ ఎల్డీవో రమేశ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ మండలంలోని 16 గ్రామాల్లో పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులను ఫారెస్ట్ భూముల పేరుతో అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.