ప్రోటోకాల్ వివాదం... అలిగిన మంత్రి పొన్నం, మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి

byసూర్య | Tue, Jul 09, 2024, 11:51 AM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలకు వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. వీఐపీలు వచ్చినా సరైన సెక్యూరిటీ లేదని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పై సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ పాటించలేదని కోపంతో గుడిబయటే కూర్చున్నారు మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి.అధికారులతో మాట్లాడి ఏర్పాట్లపై అధికారులను నిలదీశారు మేయర్ విజయలక్ష్మి. ఈ క్రమంలో మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మికి అధికారులు సర్ది చెప్పారు. కాగా ఈరోజు ఎల్లమ్మ కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు మంత్రి కొండా సురేఖ. అమ్మవారి దర్శనానికి పలువురు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణనోత్సవ ఏర్పాట్లపై విమర్శలు వస్తున్నాయి


Latest News
 

జన్వాడ రేవ్ పార్టీపై స్పందించిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ Sun, Oct 27, 2024, 02:20 PM
ఎల్బీనగర్‌లో భారతదేశంలోనే అతిపెద్ద ఎస్టీపీని నిర్మించాం : కేటీఆర్‌ Sun, Oct 27, 2024, 02:09 PM
గచ్చిబౌలిలో కారు బోల్తా, డ్రైవర్‌ పరిస్థితి విషమం Sun, Oct 27, 2024, 01:59 PM
షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం Sun, Oct 27, 2024, 12:38 PM
జన్వాడలోని ఫామ్‌హౌస్‌పై పోలీసుల రైడ్ Sun, Oct 27, 2024, 12:29 PM