byసూర్య | Sat, Jun 01, 2024, 12:11 PM
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామ శివారులోని చెరువులో మహిళ మృతదేహం కలకలం రేపింది. పెద్ద చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలి తీశారు. మహిళకు సంబంధించిన వివరాల గురించి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.