byసూర్య | Tue, May 28, 2024, 07:01 PM
ఖరీఫ్ సీజన్ లో రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాలని కోరుతూ మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ కు వినతి పత్రం అందించినట్లు AIPKS జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భగవంతు, యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రైతులకు ఎరువులు, విత్తనాలు 50 శాతం సబ్సిడీతో అందించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులపై జరిపిన లాఠీ చార్జీని ఖండిస్తున్నామని చెప్పారు.