byసూర్య | Tue, May 28, 2024, 06:56 PM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో మాజీ జడ్పిటిసి సభ్యుడు తిరుమల్ రెడ్డి జయంతి వేడుకలను పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకుడు సంకాపురం రాముడు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా కొనసాగింది. శిబిరాన్ని ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. మొత్తం 240 మంది రక్తదానం చేశారు. అనంతరం మండలంలో పదో తరగతి లో ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించిన 32 మందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా నిఘంటువులను అందజేశారు.