byసూర్య | Tue, May 28, 2024, 06:55 PM
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకుడు, దివంగత నేత ఎన్టీఆర్ జయంతి వేడుకలను జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, నాయకులు భీమన్న, నరసన్న, అంజి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.