byసూర్య | Tue, May 28, 2024, 06:44 PM
ప్రైవేట్ ఆసుపత్రులలో అందించిన వైద్య సేవలు, అపరేషన్లు, ఇమ్యునైజేషన్ వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలి డిప్యూటీ జిల్లా వైద్య శాఖ అధికారి శైలజా అన్నారు. మంగళవారం నారాయణపేట కార్యాలయంలో ప్రైవేట్ ఆసుపత్రుల డైరెక్టర్లకు ఆన్లైన్ నమోదు పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తప్పనిసరిగా వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణలపై ఫైర్ స్టేషన్ ఎస్సై మల్లికార్జున్ అవగాహన కల్పించారు.