byసూర్య | Tue, May 28, 2024, 06:42 PM
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ సమీపంలోని దండు క్రాస్ దగ్గర 167వ రహదారిపై మంగళవారం కర్ణాటక బస్సు బైక్ ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయలయ్యాయి. మృతి చెందిన వారు మక్తల్ పట్టణానికి చెందిన రాఘవేంద్ర చారి, వెంకటేష్ గా గుర్తించారు. గాయపడిన మహేష్ కూడా మక్తల్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.