byసూర్య | Tue, May 28, 2024, 06:41 PM
బడుగుబలహీన వర్గాల ఆశ జ్యోతి నందమూరి తారకరామారావు అని టిడిపి ఉమ్మడి పాలమూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాములు అన్నారు. మంగళవారం దామరగిద్ద మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.