byసూర్య | Tue, May 28, 2024, 06:33 PM
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతానాలు తక్షణమే ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఏఐటియుసి అధ్వర్యంలో దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఐదారు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేవేందర్ రెడ్డి, రామస్వామి, నాయకులు వెంకటేశ్వర్లు, వెంకట్రాములు, మల్లయ్య, కార్మికులు, పాల్గొన్నారు.