byసూర్య | Tue, May 28, 2024, 06:32 PM
కోదాడలో పశువుల సంత సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రసీదు లేకుండా అక్రమ వసూళ్లు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని అడిగిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. పాలక వర్గం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారి అక్రమ వసూళ్లకు అడ్డులేదంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోదాడ ప్రజలు కోరుతున్నారు.