byసూర్య | Sun, May 26, 2024, 05:33 PM
సిద్దిపేటలోని రాజీవ్ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందడం జరిగింది. వివరాల్లోకి వెళితే శివరాత్రి స్వామి (40) ప్రస్తుతం బీడీ కాలనీలో నివసిస్తున్నాడు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రోజువారి కూలీలో భాగంగా సిద్దిపేటలోని రాజీవ్ రహదారిపై ఏవన్ దాబా వద్ద నుండి స్కూటీ పై వెళుతుండగా కారు అతి వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్ర గాయాలతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది.