byసూర్య | Sun, May 26, 2024, 05:31 PM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం బ్రాహ్మణ చెరువులో చేపల వేట కోసం వల వేస్తుండగా కాళ్లకు చుట్టుకొని గ్రామానికి చెందిన దోమ్మ రంగులు (55) అనే మత్స్యకారుడు శనివారం ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పటాన్చెరువు ప్రభుత్వ మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.