byసూర్య | Sun, May 26, 2024, 05:29 PM
ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు ఆర్టీసీ ప్రయాణం చేసే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఆదివారం కల్లూరు పట్టణానికి చెందిన పలువురు దాతలు ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపో అధికారులు, స్థానిక పట్టణ ప్రముఖులు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.