byసూర్య | Sun, May 26, 2024, 05:28 PM
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామంలో గల రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డుపై ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపు నీరు అంతా రోడ్లపై నిల్వ ఉండడంతో గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు స్థానిక గ్రామ సొసైటీ చైర్మన్ కోటా వెంకటకృష్ణ ఆదివారం తమ సొంత ఖర్చులతో ప్రజా సమస్యల పరిష్కారాల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.