byసూర్య | Sun, May 26, 2024, 05:27 PM
ఖమ్మం రైల్వే స్టేషన్లోని ప్లాట్ ఫామ్-2 పై శనివారం చేపట్టిన తనిఖీల్లో రైల్వే పోలీసులు ఏడు లక్షల విలువైన 28 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్ ఫామ్ పై జిఆర్పి ఎస్ఐ భాస్కరరావు, సిబ్బంది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మొదటి ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద 4 బ్యాగులు కనిపించి సమీపాన ఎవరూ లేకపోవడంతో పరిశీలించడంతో గంజాయి లభించింది. కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.