byసూర్య | Sun, May 26, 2024, 12:01 PM
హైదరాబాద్ సైనిక్ పూరి పరిధిలో ఏకంగా దాదాపు 30 సంవత్సరాల చరిత్ర కలిగిన ఓ ఫేమస్ బేకరీలో ఉన్నటువంటి కేకు బూజు పట్టిందని ఫొటోలు వైరల్ అయ్యాయి. అయినప్పటికీ అలాగే విక్రయిస్తున్నారని కొనుగోలు చేసిన వ్యక్తులు శనివారం 'ఎక్స' వేదికగా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ కమిషన్ బృందం వెంటనే స్పందించాలని కోరారు. తనిఖీలు చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.