byసూర్య | Sat, Apr 27, 2024, 06:59 PM
జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో శనివారం 114 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రితి రాజ్ తెలిపారు. పట్టణంలోని కోయిలదిన్నె రహదారి సమీపంలో ఓ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు శాంతినగర్ సిఐ రత్నం, ఎస్సై సంతోష్ కు సమాచారం రావడంతో నేరుగా అక్కడికి వెళ్లి దాడి చేసి బియ్యం నిల్వలను పట్టుకున్నారు. ఇంటి యజమాని భాస్కర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు.