byసూర్య | Thu, May 09, 2024, 02:58 PM
ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన గొల్ల కురుమ యాదవులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరేడుగం గ్రామంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే, గద్వాల జడ్పీ చైర్మన్ సరితతో కలిసి పాలమూరు పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డికు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నాయకులు ఆనంద్ గౌడ్, రవికుమార్ యాదవ్, కోళ్ల వెంకటేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు.