byసూర్య | Thu, May 09, 2024, 03:01 PM
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని నిజాంబాద్ గ్రామంలో గురువారం బిజెపి నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఖానాపురం భాస్కర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. బిజెపి ఎంపీ అభ్యర్థి గుర్తులు చూపిస్తూ నమూనా ఈ. వి. ఎం. తో ప్రచారం చేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి బిజెపి అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు.