byసూర్య | Thu, May 09, 2024, 03:04 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని సర్వారెడ్డిపల్లి గ్రామంలో గురువారం భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశాలలో నమూనా బ్యాలెట్ చూపిస్తూ ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.