byసూర్య | Thu, May 09, 2024, 03:13 PM
భూత్పూర్ మండలం హాస్నాపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఉపసర్పంచ్ నర్సిరెడ్డి, వార్డ్ మెంబర్లు బుచ్చిరెడ్డి, ఆంజనేయులు, హనుమంతు నాయక్, రాములు గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఎంపిపి కదిరే శేఖర్ రెడ్డి, హస్నాపూర్ అధ్యక్షులు కే తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.