byసూర్య | Thu, May 09, 2024, 02:51 PM
నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించుకొని అభివృద్ధికి బాటలు వేసుకుందామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక పథకాలను అమలు చేశామని వెల్లడించారు. అబద్దాల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నమ్మొద్దని అన్నారు. కాంగ్రెస్ తోనే దేశం అభివృద్ధి సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.