byసూర్య | Thu, Apr 25, 2024, 01:26 PM
ఉపాధిహామీ పనులు చేసే కూలీలకు ప్రభుత్వం పని ముట్లు అందించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. గురువారం నారాయణపేట మండలంలోని బోయిన్ పిల్లి, షేర్నపల్లి గ్రామాలలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కూలి డబ్బులు సమయానికి ఇవ్వడం లేదని నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. పెండింగ్లో ఉన్న కూలి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.