byసూర్య | Thu, Apr 25, 2024, 01:14 PM
పిట్లం మండలం గద్ద గుండు తండా సమీపంలో నేషనల్ హైవే(161) పై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తున్న వ్యక్తిని డీసీఎం ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం బాత్కుర్ గ్రామానికి చెందిన సుభాష్(25) గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.