byసూర్య | Wed, Apr 24, 2024, 01:10 PM
ఇంట్లోంచి వెళ్లిన వివాహిత అదృష్యమైన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన తెడ్డు అనిత బీబీపేట మండలం జనగామాలో పచ్చకామెర్లకు మందుతాగి వస్తానని కామారెడ్డికి బయలుదేరింది. కామారెడ్డిలో ఆటో దిగిన ఆమె, తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. భర్త బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తేన్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.