byసూర్య | Mon, May 06, 2024, 01:57 PM
కార్మిక, రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల మధ్య చీలికలు చేస్తున్న మతతత్వ బిజెపిని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సిపిఎం పట్టణ విస్తృతస్థాయి సమావేశం పట్టణ కార్యదర్శి ఎండి సలీం అధ్యక్షతన జరిగింది. బిజెపి ఓడించి ఇండియా కూటమిని కేంద్రంలో అధికారంలోకి రావడానికి వామపక్షాల సహకారం ఎంతో అవసరమని అన్నారు.