కంటోన్మెంట్ లో మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం

byసూర్య | Mon, May 06, 2024, 01:51 PM

కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ప్రచారానికి అద్భుత స్పందన వస్తోందని మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు కంటోన్మెంట్ లో ప్రచారం చేసిన అనంతరం పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలవడం ఖాయమని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని మాజీమంత్రి మల్లారెడ్డి తేల్చి చెప్పారు. మొన్నటిదాకా బీజేపీలో ఉన్న వ్యక్తి హఠాత్తుగా కాంగ్రెస్ లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా మారాడని మండిపడ్డారు. కాబట్టి ముస్లిం మైనార్టీలతో పాటు అన్నివర్గాల ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఈ ప్రెస్ మీట్ లో మాజీమంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితతో పాటు ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, మాధవరం క్రుష్ణారావుతో పాటు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇంఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM