byసూర్య | Mon, Apr 22, 2024, 02:50 PM
భూ వివాదంపై దయాధుల చేతిలో అతి తీవ్రంగా గాయపడిన పెబ్బేరు మండల కేంద్రానికి చెందిన గుండ్రాతి నరసింహ గౌడ్ ను సోమవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పరామర్శించి తానున్నానని కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దాడి చేసినవారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తాను ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ఎమ్మెల్యే బాధితుడు నరసింహ గౌడ్ కు సూచించారు.